Monday, August 31, 2009

నాకు నచ్చిన కథ

ఇది చదివిన కథ కాదు.... చూసిన కథ.... టీవి లో చూసాను.... నాకు బాగా నచ్చింది అందులో ఒకపాత్ర రాళ్ళపల్లి గారు చేసారు.పేరు గుర్తు లేదు.... ఇక కథ లోకి వెళ్తే ముఖ్య పాత్ర రాళ్ళపల్లి గారిది, అందులో ఆయన ఒక కిరానా కొట్టు యజమాని గా నటించారు...కాదు జీవించారు.... ఆయన పాత్ర విషయానికొస్తే ఒక నిష్కల్మషమైన, పదిమంది మంచి కోరే మనసున్న మనిషి...ఎవరైనా ఆపద లో వుంటే తనకున్నదంతా ఇచ్చేసి వారు పడే సంతోషం తో కడుపు నింపుకునే వ్యక్తీ.
అంతే కాకుండా వూళ్ళో అందరూ తన మంచి తనాన్ని చేతకాని తనంగా భావించి పబ్బం గడుపుకునేవాల్లె, అది తెలిసినా తన మంచి తనాన్ని వదలలేకపోయేవాడు. చాలా మంది డబ్బు తరువాత ఇస్తామని కొట్టునుండి సరుకు తీసుకుని మళ్ళీ కనిపించేవారు కాదు,ఒకవేళ ఎవరినైనా సరుకులకి డబ్బు ఎప్పుడిస్తారు అని అడిగినా మాట దాటవేసేవారు. ఇలా వుండగా వూళ్ళో గుడి కట్టడానికి చందాలకోసం కొంతమంది పెద్దమనుషులు ఆయన దగ్గరకు వచ్చి డబ్బు అడుగుతారు, భగవత్కార్యానికే కదా అని ఒక వెయ్యి రూపాయలు విరాళంగా ఇస్తాడు, కాని ఐదువందల రూపాయలే ఇచినట్టు రాయమని చెప్తాడు,వాళ్లు అలాగే రాసి వెళ్ళిపోయాక, అదిగమనించిన ఒక మిత్రుడు ఎందుకలా రాఇంచావు ఒక వేళ వాళ్లు రాసింది ఐదువందలే కదా అని మిగిలింది జేబులో వేసుకుంటే ఎలా? అని అడుగుతాడు. అప్పుడు కొట్టు యజమాని " అలా జరుగుతుంది అని నేను అనుకోలేదు మంచిపనికి ఇచ్చింది హృదాగా పోదు, ఇక అలా తక్కువగా ఎందుకురాసానంటే, అది చూసిన పెద్దలు నాకన్నా తక్కువ ఇస్తే బాగోదనే వుద్దేశం తో, అంతకు మించి ఇస్తారు దైవకార్యానికి ఎక్కువ డబ్బు సమకూరుతుంది కదా" అంటాడు. కాని తను అనుకున్నట్టుగా అక్కడ జరగదు. అందరూ "శెట్టి గారికేం బాగా డబ్బుంది ఏమైనా చేస్తాడు మాకేం డబ్బులు చెట్లకు కాయట్లేదు" అంటూ పది, యాభయ్ అలా ఇస్తారు.... ఇది ఇలా వుండగా చివరికి భార్యా పిల్లలకు జబ్బు చేస్తే కూడా వైద్యానికి ఒక్క పైసా కూడా వూళ్ళో అతనికి పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా పరిస్థితుల్లో కూడా పాత బాకీలు వసూలు చేయాలనుకునే వాళ్లు కూడా ఎదురవుతారు. తన వల్ల ఊరికి, వూళ్ళో వాళ్ళకి ఎంతో మేలుజరిగినా చివరికి వాళ్ల ప్రవర్తన తన మనసుకి గాయం చేస్తుంది. వూరు వదలి వెళ్ళిపోతాడు. అందరు అప్పులు చేసి అవి తీర్చకుండా పారిపోయాడు అంటారు. అలా వెళ్ళిన తను ఒక చిన్న వ్యాపారం మొదలెట్టి దాన్ని అంచలంచలుగా పెంచి గొప్ప ధనవంతుడిగా మారి తన వూరిలో ఒకప్పుడు తనకు డబ్బు సహాయం చేసిన వాళ్ళందరికీ తిరిగి డబ్బు ఇచ్చేయాలని చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వస్తాడు. ఆ వూరు ఏమి మారినట్టు కనిపించదు, తనకు మంచి మిత్రుడిగా వున్నా బడి పంతులు మాత్రం ఆప్యాయంగా పలకరిస్తాడు. సాయంత్రం వూరివారందరిని గుడి దగ్గరకి పిలిచి వాళ్ల వాళ్ల డబ్బు తిరిగి ఇచేస్తాడు. తర్వాత సాయంత్రం తిరిగి వెళ్తూ తన మిత్రుడిని పిలిచి నేను ఇన్నాళ్ళకి డబ్బు తిరిగి ఇచ్చినందుకు మన వాళ్లు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు, అపుడు ఆ పంతులు గారు ఎందుకు లేరా ఎవరిడబ్బు వాళ్ళకి ఇచ్చేసావ్ కదా అవన్నీ ఎందుకు ఇక అంటే, చెప్పమని బలవంతం చేస్తాడు. ఏముంది రా మన ఊరి వాళ్లు ఏమి మారలేదురా...నువ్విచ్చిన డబ్బు తీస్కుని కూడా నిన్నే అంటున్నారు ఎవడి తలమీద చేయి పెట్టి, ఎంతమందిని ముంచి ఉంటాడో లేకపోతె ఇంత తొందరగా అంత డబ్బు సంపాదిస్తాడా....ఇలా ఎవరికీ తోచినట్టు వాళ్లు అనుకుంటున్నార్రా... అని చెప్పేసరికి తీక్షణంగా నవ్వుకుంటూ వూరు దాటి వెళ్ళిపోతాడు..... ఈ కథంతా చూసాక "సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడు పడఓయి " అన్న సామెత ఒకరకంగా తప్పేమో అనిపిస్తుంది కదా...స్వలాభం కూడా చాల అవసరం, అలాగే ఇతరులకి ఎంత సహాయం చేయాలో అంత చేస్తే చాలు.

5 comments:

  1. చాలా బావుందండి.మంచితనానికి రోజులు కావు అంటే ఏమిటో అనుకునేదానిని.ఇప్పుడు అర్ధం అయింది.

    ReplyDelete
  2. వదలలేకపోయేవాడు. చాలా మంది డబ్బు తరువాత ఇస్తామనికొట్టునుండి సరుకు తీసుకుని మళ్ళీ కనిపించేవారు కాదు,ఒకవేళఎవరినైనా సరుకులకి డబ్బు ఎప్పుడిస్తారు అని అడిగినా మాటదాటవేసేవారు

    ' వైద్యానికి ఒక్క పైసా కూడా ఆ వూళ్ళో అతనికిపుట్టని పరిస్థితి ఏర్పడుతుంది.'

    " వూరిలో ఒకప్పుడు తనకు డబ్బు సహాయం చేసిన వాళ్ళందరికీ తిరిగి డబ్బు ఇచ్చేయాలని చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వస్తాడు"



    నాకు ఒక విషయం అర్ధం అవలెదు-- ఆ ఊళ్ళొ వాళ్ళందరూ, అతనిదగ్గర అప్పులు చేసినవాళ్ళే. ఇతను ఎవరికీ ఈయవలసిన అవసరం లేదు కదా !!మరి ఎందుకు ఆ ఊరికి తిరిగి వచ్చాడు?

    ReplyDelete
  3. లేదండి ఆయన అందరికి ఇచ్చి ఇచ్చి అంతా ఐపోయి తనే అప్పు చేస్తాడు అనుకుంటా అందుకే మల్లి ఆ వురికి వస్తాడు

    ReplyDelete
  4. థాంక్స్ రాధిక గారు

    ReplyDelete
  5. చాలా బావుందండి

    ReplyDelete